ప్రకాశం బ్యారేజీకి 11.20 లక్షల క్యూసెక్కుల వరద

69చూసినవారు
విజయవాడలోని ప్రకాశ్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి తీవ్రంగా ఉంది. గంట గంటకు వరద పెరుగుతోంది. మొత్తం 70 గేట్లు తెరిచి, బ్యారేజీ నుంచి 11.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటిమట్టం 23.3 అడుగుల మేర కొనసాగుతోంది. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్