ఎస్పీ బాలు పాడిన తొలి, ఆఖ‌రు పాట తెలుసా?

61చూసినవారు
ఎస్పీ బాలు పాడిన తొలి, ఆఖ‌రు పాట తెలుసా?
1967 జూన్‌ 2న విడుదలైన 'శ్రీశ్రీశ్రీ మ‌ర్యాద రామ‌న్న' చిత్రం ద్వారా ఎస్పీ బాలుకు తొలిసారి వెండితెర‌పై ఓ పాట పాడే అవ‌కాశం ల‌భించింది. ఈ సినిమాకు న‌టుడు ప‌ద్మ‌నాభం నిర్మాత. కోదండ‌పాణి సంగీతం అందించారు. ఇందులో గాయ‌ని పి.సుశీల‌తో క‌లిసి "ఏమి వింత మోహం" అనే పాటను బాలు ఆల‌పించారు. చివ‌రగా.. 'ప‌లాస 1978' సినిమాలో 'ఓ సొగ‌స‌రి' అనే పాట‌ను ప‌లాస బేబీతో క‌లిసి పాడారు. ల‌క్ష్మి భూపాల రాసిన ఈ పాట‌కు ర‌ఘు కుంచె సంగీతం అందించారు.

సంబంధిత పోస్ట్