లంగుపర్తిలో "పొలం పిలుస్తుంది" కార్యక్రమం

80చూసినవారు
లంగుపర్తిలో "పొలం పిలుస్తుంది" కార్యక్రమం
అనంతగిరి మండలంలోని లంగుపర్తి పంచాయతీ మెట్టవలసి గ్రామంలో.. మండల వ్యవసాయ అధికారిని కే ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో "పొలం పిలుస్తోంది" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిని, సర్పంచ్ ఆయా గ్రామాల రైతులతో పంట పొలాలను పరిశీలించారు. సాగు పద్ధతులపై రైతులకు పలు సూచనలు చేశారు. పంటలో దోమ ఉధృతి అధికంగా ఉంటే ఎకరానికి ఇడాక్లోర్ఫిడ్ 17.8 ఈసీ 50 మిల్లీలీటర్ల ద్రావణం పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్