అమరావతి నమూనా గ్యాలరీ ధ్వంసం

84చూసినవారు
అమరావతి నమూనా గ్యాలరీ ధ్వంసం
అమరావతి నమూనా గ్యాలరీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్దండరాయినిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, దుండగులు ఆ నమూనా గ్యాలరీను పగలగొట్టారు. అమరావతి ముఖచిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్ లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపేలా బోర్డులను రూపొందించారు. వాటిని దుండగులు ధ్వంసం చేశారు.

ట్యాగ్స్ :