రామరాజు చనిపోయే ముందు ’’ఒక అల్లూరి మరణిస్తే లక్షల మంది వీరులు పుట్టుకువస్తారు. వారంతా విప్లవ యోధులుగా మారతారు. ప్రతి రక్తం బొట్టు ఒక సైనికుడిని తయారు చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యం నేల కూలుతుంది‘‘ అని మేజర్ గుడాల్తో అల్లూరి సీతారామరాజు నిర్భయంగా పలికిన పలుకులివి. ఆయన పలికిన ఒక్కో మాట తూటాగా పేలింది. వందేమాతరం అంటూ దేశభక్తిని నింపి ప్రాణత్యాగం చేశారు. ఆ వీరుడు అన్నట్టుగానే లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పుట్టుకువచ్చారు. తెల్లవారిని తరిమికొట్టారు.