బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడికి వ్యతిరేకంగా, సామాన్య గిరిజనులను చిత్రహింసలు
పెట్టడం సహించలేక అల్లూరి మన్యం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అల్లూరి నాయకత్వ శిక్షణలో ఆగష్టు 22న 150 మంది ఆదివాసీ గెరిల్లాలు చింతపల్లి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. వెనువెంటనే కృష్ణదేవి పేట, రాజ వొమ్మంగి, దేవిపట్నం పోలీస్ స్టేషన్లను ముట్ట డించారు. ఇదే మన్యం పోరాట తొలి ఘటనగా చరిత్రలో నిలిచి పోయింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ పోరాటాన్ని తీవ్ర దమనకాండతో అణచివేసింది.