ఈ నెల 29న విజయవాడలో జరగబోయే వాయిస్ ఆఫ్ యంగ్
ఇండియా సదస్సును జయప్రదం చేయండి అని శనివారం రాప్తాడులో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు గోడపత్రికలు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ. 29 న జరగబోయే సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి ఏ. ధనుంజయ, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గం కార్య దర్శి బీ. వంశీ, ఏఐవైఎఫ్ మాజీ నాయకులు జి. దుర్గాప్రసాద్, నిరుద్యోగులు యువకులు పాల్గొన్నారు.