రాప్తాడు మండలంలోని బండమీదపల్లిలో తోపుదుర్తి శైలజా రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి వైసీపీ పార్టీని ఆదరించాలని అభ్యర్థించారు.