మత్తు పదార్థాల జోలికి పోకుండా చదువులో ఉన్నతంగా రాణించాలి

72చూసినవారు
రాయదుర్గం పట్టణం జూనియర్ కళాశాల మైదానంలో ప్రిన్సిపాల్ వీరేష్ ఆధ్వర్యంలో శుక్రవారం మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి పోకుండా బాగా చదువుకొని ఉన్నతంగా రాణించాలని సూచించారు. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్