రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆస్తి పన్ను దారులకు గుడ్ న్యూస్ ని అందించిన ప్రభుత్వం. ఈనెల 30వ తేదీ లోపు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి గుత్తులు, ఖాళీ స్థలాల గుత్తులు ముందస్తుగా చెల్లించే వారికి ఐదు శాతం రిబేట్ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కిషోర్ బుధవారం మీడియా కి ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.