టిడిపి అభ్యర్థి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
బ్రహ్మసముద్రం మండలం సంతే కొండాపురం, సూగేపల్లి గ్రామాల్లో వైసీపీకి చెందిన 10కుటుంబాలు ఆదివారం టిడిపి అభ్యర్థి అమిలినేని ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. సూగేపల్లి మాజీ ఫిల్డ్ అసిస్టెంట్ కృష్ణమూర్తి, మాజీ వెలుగు ఆనిమేటర్ మల్లికార్జున, గోవిందులతో పాటు మరో 7కుటుంబాలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి సురేంద్రబాబు టిడిపి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.