సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

573చూసినవారు
సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
కదిరి లో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సర్కిల్ లో అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా శనివారం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి ప్రసాదించిన నాయకుడు అంబేద్కర్ అని ఆయన అడుగుజాడల్లో పయనించి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు.

సంబంధిత పోస్ట్