బోర్లు యొక్క కేబుల్ వైర్ లు దోచుకెళ్తున్న దొంగలు

50చూసినవారు
బోర్లు యొక్క కేబుల్ వైర్ లు దోచుకెళ్తున్న దొంగలు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం శుక్రవారం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి రైతుకు సంబంధించిన బోర్ కేబుల్ వైర్లు గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. దాదాపు 140 మీటర్లు కేబుల్ వైరు చోరీ చేసుకుని వెళ్లారని దీంతో దాదాపు పదివేల రూపాయల వరకు నష్టం జరిగినట్లు రైతు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్