
అమరాపురం: ట్రాక్టర్ కింద పడి మృతి
అమరాపురం మండలం కాచికుంట గ్రామానికి చెందిన మంజునాథ్ అనే యువకుడు శనివారం ట్రాక్టర్ చక్రం కింద పడి మృతి చెందాడు. రైతులు తెలిపిన వివరాల మేరకు కాచికుంట గ్రామానికి చెందిన మంజునాథ్ ఓ రైతు పొలంలో ట్రాక్టర్ తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడడంతో చక్రం మీదికి ఎక్కి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.