ఎంపిడిఓ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

81చూసినవారు
ఎంపిడిఓ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
యల్లనూరు ఎంపిడిఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంపిడిఓ కార్యాలయానికి ISO 9001: 2015 సర్టిఫికేట్ గుర్తింపు లభించేలా చూడాలన్నారు. కార్యాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మరియు ఏపిఎమ్ఐపి పిడి రఘునాథ రెడ్డి, ఎంపీడీవో వీర్రాజు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్