వైభవంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

64చూసినవారు
వైభవంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం
ఎమ్మార్సీఎస్ ఆవివర్భావ దినోత్సవాన్ని తాడిపత్రిలో ఆదివారం తాడిపత్రి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు వైభవంగా నిర్వహించారు. దళితుల ఆరాధ్యుడు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పుట్టిన రోజు సందర్భంగా కేకు కోసి సంబరాలు చేశారు. నాయకులు గంగాదేవిపల్లి గంగరాజు, విశ్వనాద్, పుల్లయ్య, రాజారత్నం, ఆంజనేయులు, బాజపా నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్