అతిసార ప్రబలకుండా చర్యలు చేపట్టండి

60చూసినవారు
గ్రామాల్లో అతిసార ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, డయేరియా వలన ఎలాంటి మరణాలు సంభవించకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని భ్రమరాంబదేవి తెలిపారు. శనివారం ఉరవకొండ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న అతిసార కేసుల వివరాలను డాక్టర్ గంగాధర్ నుంచి అడిగి తెలుసుకున్నారు. అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్