రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 7వ రోజు కొనసాగుతోంది. గుంటూరు, కడప, విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం సహా చాలా చోట్ల తమ సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. సీడీపీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. వేతనాల పెంపు, పింఛను అమలు తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.