పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల డేటాను తాజాగా యూనిసెఫ్(UNICEF) విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రతి నలుగురు పిల్లల్లో ఒక్కరు తీవ్రమైన ఆహార పేదరికంతో బాధపడుతున్నారని తెలిపింది. ఈ పట్టికలో ఆసియాలో.. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది.