హైదరాబాద్, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా, సీఎంగానైనా సమాధానం చెప్పాలని సునీత డిమాండ్ చేశారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో మీరు కూడా ఒకరు కదా! హత్య ఎవరు చేశారో చెప్పాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది. ఈ కేసులో అవినాష్రెడ్డి ప్రమేయం గురించి తెలిస్తే ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.