బొప్పూడి వేదికగా ఆదివారం జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) ముఖేశ్ కుమార్ మీనాకు NDA నేతలు ఫిర్యాదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, బి.రామకృష్ణ తదితరులు CEOను కలిసిన వారిలో ఉన్నారు.