నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్.. రూల్స్ ఇవే..

68చూసినవారు
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్.. రూల్స్ ఇవే..
నేటి నుంచి ఈనెల 23 వరకు ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి. రోజూ ఉ.9 నుంచి మ.12 వరకు, మ.2.30 నుంచి సా.5.30 వరకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి.
*విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.
*సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. అవి దొరికితే డిబార్ చేస్తారు.
*బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవద్దు.
*160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కులు లేవు.

ట్యాగ్స్ :