హైదరాబాద్ మణికొండలోని మెహ్ఫిల్ రెస్టారెంట్లో మహిళలు పెట్టుకునే సేఫ్టీ పిన్ వచ్చింది. ఓ వ్యక్తి శనివారం మధ్యాహ్నం ఆన్లైన్ ద్వారా బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా పిన్ కనబడింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరలవుతోంది. ఇది చూసిన వారంతా బిర్యానీ తినాలంటేనే భయమేస్తోందని అంటున్నారు.