కుట్ర కోణంలోనే సీఎం జగన్‌పై దాడి: మంత్రి కాకాణి

1116చూసినవారు
కుట్ర కోణంలోనే సీఎం జగన్‌పై దాడి: మంత్రి కాకాణి
సీఎం జగన్‌పై నిన్న జరిగిన రాయి దాడిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. కుట్ర కోణంలోనే సీఎం జగన్‌పై దాడి జరిగిందన్నారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ.. ‘దాడి ఘటనను టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారు. దాడి తీవ్ర పెద్దదైనప్పటికీ.. సీఎం జగన్ మొక్కవోని సంకల్పంతో యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజల్లో ఆదరణ కలిగిన వంగవీటి రంగాను చంద్రబాబే హత్య చేయించారు. ప్రజల్లో సీఎం జగన్ ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్