అద్దంకి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా!

562చూసినవారు
అద్దంకి నియోజకవర్గ ఉమ్మడి కూటమి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అద్దంకిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 5వ సారి నామినేషన్ వేయటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అద్దంకి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రవికుమార్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం కచ్చితంగా అధికారంలోకి వస్తుందని గొట్టిపాటి ధీమా వ్యక్తం చేశారు.