ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్తో షార్ట్ సర్క్యూట్ జరగడం.. డయాలసిస్ యంత్రాలు చెడిపోవడంతో కిడ్నీ రోగులు నానా అవస్థలు పడ్డారు. హైదరాబాద్, విజయవాడ నుంచి మెకానిక్స్ వచ్చి ఆరో ప్లాంట్ రిపేర్ చేసే క్రమంలో రోజంతా గడిచిపోయింది. దీని వల్ల చాలామంది డయాలసిస్ బాధితులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. రెండు రోజులపాటు డయాలసిస్ రోగులు ఆందోళన చెందారు.