జగన్ వికృత క్రీడకు అనేకమంది పేదలు బలయ్యారని టిడిపి బాపట్ల జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బుధవారం మార్టూరు మండలం రాజుపాలెం, పర్చూరు మండలం పోతుకట్ల గ్రామాల నుంచి పలువురు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఏలూరి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల జీవితాల్లో మార్పు తెలుగుదేశంతోనే సాధ్యమన్నారు.