వైసీపీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

566చూసినవారు
వైసీపీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
ఏపీలో పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసీపీ దారుణాలకు పాల్పడుతోందని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ చర్యలతో చాలామంది ఓటర్లు ఓటు వేయకుండానే ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. అధికార వైసీపీ తమ గూండాలతో అరాచకాలు, గూండాయిజం చేయించి ప్రజాస్వామ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. కూటమి అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, ప్రజలపై వైసీపీ దాడుల చేస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది.