టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సీఎం జగన్ సంచలన విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు, పవన్ను కలిసి పేదవాడి భవిష్యత్ మీద యుద్ధానికి వస్తున్నారు. మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి అయినా వేశాడా?. ఒకరికి విశ్వసనీయత లేదు. ఒకరికి విలువ లేదు. చంద్రబాబు అంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రాదు’ అని అన్నారు.