విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం

1898చూసినవారు
విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం
విశాఖ పోర్టు డ్రగ్స్ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాకినాడ జిల్లా మూలపేటలోని సంధ్య ఆక్వా బ్రాంచ్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్ ఎగ్జిక్యూటర్ డైరెక్టర్ హరి పేరుతో ఆర్డర్లు రావడంతో విచారణ జరుపుతున్నారు. కాగా, విశాఖ డ్రగ్స్ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల సమయంలో విపక్షాలకు అస్త్రంగా మారింది. సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌తో రాజకీయ పార్టీల సానిహిత్యంపై విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్