గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీకోనేటి రాయస్వామి ఆలయంలో కీలపట్ల సర్పంచ్ చంద్రశేఖర్ సోమవారం తన మొక్కులు చెల్లించుకున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అమర్నాథెడ్డి గెలవాలని ఆలయంలో మొక్కుకున్నానని, ఈ మేరకు మోకాళ్ళ మీద నడిచి, 101 కొబ్బరికాయలు కొట్టి, తలనీలాలు సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమర్నాథెడ్డికి మంత్రి పదవి కూడా దక్కాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.