

పలమనేరు: ముమ్మరంగా సీసీ కెమెరాల మరమ్మతులు
పలమనేరు పట్టణంలో పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల మరమ్మతులు సీఐ నరసింహరాజు ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం చేపట్టారు. పట్టణంలో ప్రధాన కూడళ్లలో నేరాల నివారణకు గతంలోనే పోలీసు శాఖ వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని చెడిపోవడంతో సీఐ నరసింహరాజు ఆధ్వర్యంలో వాటికి మరమ్మతులు చేపట్టారు. మరికొన్ని చోట్ల దుకాణదారులకు అవగాహన కల్పించి కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.