గత ఎన్నికల సమయంలో పలమనేరు నడిబొడ్డున ప్రజలకు ఎమ్మెల్యే వెంకటేగౌడ, సీఎం జగన్ ఇచ్చిన హామీలకే దిక్కు లేదని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హామీలు నెరవేర్చకుండా జగన్ ఏ ముఖం పెట్టుకొని పలమనేరు నియోజకవర్గానికి వస్తారని ప్రశ్నించారు. అనంతరం మాజీ కౌన్సిలర్ ఏరుగుత్తి బాలాజీ తదితరులు టీడీపీలో చేరడంతో ఆయన పసుపు కండువా కప్పారు.