భారీగా కర్నాటక మద్యం ధ్వంసం

83చూసినవారు
గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన అక్రమ కర్నాటక మద్యాన్ని కుప్పం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్ లో మంగళవారం ధ్వంసం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సూపరిడెంట్ శ్రీధర్ పర్యవేక్షణలో 1554 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు. మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం అర్బన్ సీఐ జీటీ నాయుడు, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్