హాస్టల్ విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్న ఎమ్మెల్సీ

64చూసినవారు
కుప్పంలోని ఎస్సీ, బీసీ హాస్టల్స్ ను శుక్రవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్ విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. హాస్టల్స్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. త్వరలో హాస్టల్స్ కు నూతన భవనాల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్