కలికిరి మండల సర్వసభ్య సమావేశం వాయిదా

72చూసినవారు
కలికిరి మండల సర్వసభ్య సమావేశం వాయిదా
కలికిరి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించ తలపెట్టిన సర్వసభ్య సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో సీ. గంగయ్య తెలిపారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 9: 30 గంటలకు ప్రారంభం కాగా
ఉ. 11: 30 గంటల వరకు వేచి చూసి సర్పంచులు, ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు గైర్హాజరీతో ఈ సర్వసభ్య సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ఎంపీడీవో లిఖిత పూర్వకంగా ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కలికిరి సీఐ శేఖర్ రెడ్డి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్