వైఎస్ఆర్ కు ఘన నివాళి: మాజీ ఎంపీ

61చూసినవారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు పుంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ బస్టాండ్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష, కౌన్సిలర్లు అమ్ము, కిజర్, షరీఫ్, రాజేష్, హేమంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్