చిత్తూరు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం మర్రిపల్లిలో క్షుద్ర పూజల కలకలం రేపింది. మర్రిపల్లిలోని స్మశాన వాటికలో మనిషి ఆకారంతో చేయబడ్డ మట్టిబొమ్మపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.