AP: సీఎం హోదాలో తొలిసారి మంగళగిరి టీడీపీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు పోలీసులపై సీరియస్ అయ్యారు. పార్టీ కార్యాలయంలో బారికేడ్లు ఏంటి? అని పోలీసులను ప్రశ్నించారు. కార్యకర్తలను కలిసేటప్పుడు బారికేడ్లని పెట్టొద్దని, తనకు-ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తామని వెల్లడించారు. ప్రజా వినతుల స్వీకరణకు సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు.