యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరేందుకు అస్సాంలోని పురాతన పిరమిడ్లు అడుగు దూరంలో నిలిచాయి. వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ యునెస్కోకు ప్రతిపాదించింది. ప్రధాని మోదీ వీటిని స్వయంగా నామినేట్ చేయడం గమనార్హం. ఈ పిరమిడ్లు అహోం రాజవంశస్థులకు చెందినవి.