పెన్ష‌న్ల‌పై సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర ట్వీట్

66చూసినవారు
పెన్ష‌న్ల‌పై సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర ట్వీట్
పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘మేము వాగ్దానం చేసాం. చేసి చూపించాం. నేటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్దే ఎన్టీఆర్ భరోసా పిన్షన్ అందుకుంటారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. 65.31 లక్షల మందికి పెన్షన్ అందేలా నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 24,318 మందికి పింఛన్‌ రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచిన‌ట్లు సీఎం ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్