తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

73చూసినవారు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని ఆదివారం అర్థరాత్రి వరకు 81,005 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,244 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్