మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ను మెన్స్ టీమ్కు బ్యాటింగ్ కోచ్గా నియమించినట్లు ఆర్సీబీ ప్రకటించింది. డీకే మెంటార్గానూ వ్యవహరించనున్నట్లు ట్వీట్ చేసింది. 'ఇతడిని క్రికెట్ నుంచి దూరం చేయవచ్చు గానీ ఇతడి నుంచి క్రికెట్ను దూరం చేయలేము. 12వ మ్యాన్ ఆర్మీ' అని పేర్కొంది. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడిన డీకే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.