పోలీసులు రివాల్వర్‌తో భయపెట్టారు: సతీష్

80చూసినవారు
పోలీసులు రివాల్వర్‌తో భయపెట్టారు: సతీష్
సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇటీవల బెయిల్ మంజూరైన నేపథ్యంలో నెల్లూరు జైలు నుంచి అతడిని విడుదల చేశారు. మీడియాతో సతీష్ మాట్లాడుతూ.. రాయి దాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్‌తో భయపెట్టారని తెలిపాడు. అనంతరం న్యాయవాది, కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ బయల్దేరాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్