ఏపీలో NDA ప్రభుత్వం వచ్చాక మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ నేత నారా లోకేశ్ హామీ ఇచ్చారు. దేశం కోసం పని చేసిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో మాజీ సైనికోద్యోగులు కీలక పాత్ర పోషించాలని కోరారు. శనివారం మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన లోకేశ్ ఈ మేరకు మాట్లాడారు.