నీట్-యూజీ పరీక్ష: NTA కు సుప్రీంకోర్టు నోటీసులు

63చూసినవారు
నీట్-యూజీ పరీక్ష: NTA కు సుప్రీంకోర్టు నోటీసులు
నీట్‌ ఫలితాల్లో విరుద్ధమైన మార్కులు ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టిఎ)కి సుప్రీంకోర్టు గురువారం నోటీసులిచ్చింది. ఈ నోటీసులపై తదుపరి విచారణ చేపట్టనున్న జులై 8లోగా ఎన్‌టిఎ స్పందించాలని ఆదేశించింది. ఇటీవల నిర్వహించిన నీట్‌ పరీక్షల్లో రిగ్గింగ్‌ జరిగిందంటూ లెర్నింగ్‌ యాప్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. మే 5న నిర్వహించిన నీట్‌ పరీక్షల సమగ్రతపై ఈ పిటిషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్