ఏపీ ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. రాష్ట్రంలో తొలి ఫలితం తూ.గో జిల్లా కొవ్వూరు లేదా ప.గో జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశం ఉంది. ఈ 2 సెగ్మెంట్లలో 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి, అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గాల్లో 29 రౌండ్లలో లెక్కింపు చేస్తారు. దీంతో ఈ 2 సెగ్మెంట్లలో ఫలితాలు చివరగా వెలువడే ఛాన్స్ ఉంది.