వైసీపీ సర్కార్ పెన్షన్ కోసం వృద్ధులను ఎండలో తిప్పి చంపుతోందని చంద్రబాబు మండిపడ్డారు. "పెన్షన్దారుల మరణాలు ప్రభుత్వ హత్యలే. రాష్ట్రంలో 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వారి ద్వారా ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వొచ్చు. కానీ, బ్యాంకుల్లో జమచేశారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం.. రైతు మెడకు ఉరితాడుగా మారుతుంది. అధికారంలోకి రాగానే రెండో సంతకం ఆ చట్టం రద్దుపైనే చేస్తాం." అని పొదిలి సభలో ఆయన పేర్కొన్నారు.