లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీలో ఉన్నారు. విశాఖ లోక్సభలో అత్యధికంగా 33 మంది, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతి అసెంబ్లీకి 46 మంది, మంగళగిరిలో 40 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి ఆరుగురు అభ్యర్థులే పోటీలో ఉన్నారు.