కొవ్వూరులో గౌతమి నగర్ 9వ వార్దులో టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన సూచించారు. అలాగే టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి వారికి వివరించారు.